

‘ధర్మస్థల నియోజకవర్గం’ అనే పొలిటికల్ ఎంటర్టైనర్ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ లిరికల్ సాంగ్ను ఆస్కార్ విజేత చంద్రబోస్ ఆవిష్కరించారు. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై మేరు భాస్కర్ నిర్మాణంలో, జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుమన్, సాయికుమార్, నటరాజ్, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సునీత ఆలపించిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, మహావీర్ ఎల్లంధర్ సంగీతం సమకూర్చారు.
పాట ఆవిష్కరణ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ సినిమా కాన్సెప్ట్ తనకు బాగా నచ్చిందని, మంచి మెసేజ్తో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ ఇది ఒక డిఫరెంట్ పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్టైనర్ అని తెలిపారు. నిర్మాత మేరు భాస్కర్ సినిమా అద్భుతంగా వచ్చిందని, త్వరలో టీజర్ విడుదల చేసి రిలీజ్ తేదీని ప్రకటిస్తామని చెప్పారు. ఈ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!