

సస్పెన్స్ కథలకు ప్రత్యేక గుర్తింపు పొందిన ‘దృశ్యం’ సిరీస్ ఇప్పుడు మూడో భాగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళంలో ప్రారంభమైన ఈ చిత్రం తరువాత తెలుగు, తమిళ భాషల్లో కూడా విజయాన్ని అందుకుంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు మూడో భాగంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
విడుదలకు ముందు ఈ చిత్రానికి సంబంధించి కొన్ని చట్టపరమైన సమస్యలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా డిజిటల్ హక్కుల విషయంలో వచ్చిన వివాదం వల్ల సినిమా విడుదలపై అనిశ్చితి నెలకొంది. దీంతో ఈ చిత్రం అనుకున్న సమయానికి వస్తుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
అయితే తాజాగా హీరోయిన్ మీనా ఒక పోస్టర్ విడుదల చేస్తూ అన్ని సందేహాలకు ముగింపు పలికింది. “గేమ్ ఇంకా పూర్తి కాలేదు” అనే మాటలతో వచ్చే నెల 21న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుందని ప్రకటించారు. ఆశ్చర్యకరంగా ఈ చిత్రానికి పెద్దగా ప్రచారం చేయకపోవడం గమనార్హం. కథలోని ఉత్కంఠను కాపాడాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని భావిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందో చూడాలి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!