
జనరల్

వెర్సటైల్ హీరో విశాల్ తన కెరీర్లో 35వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘మకుటం’ సినిమాతో బిజీగా ఉన్నారు. తమిళంలో ‘మగుడం’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలో విశాల్ ఏకంగా మూడు విభిన్న పాత్రల్లో కనిపించనుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఆగస్టు 7న ‘మకుటం’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు పవర్ఫుల్ పోస్టర్తో ప్రకటించారు. స్టార్ గ్రాఫ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో దుషారా విజయన్, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!