
రాజకీయాలు

అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ వేడుక ఘనంగా జరిగింది. అయితే మెగా బ్రదర్స్ హాజరు కాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. చిరంజీవి ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకోవడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. నొప్పి కారణంగా ఆయన ఈ వేడుకకు హాజరు కాలేకపోయినట్లు సమాచారం.
అలాగే పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ పనులతో బిజీగా ఉండడం వల్ల కార్యక్రమానికి రాలేకపోయారు. ప్రస్తుతం ఆయన మంగళగిరిలో ఉన్నారని సమాచారం. మేనమామలు హాజరై ఉంటే వేడుక మరింత ప్రత్యేకంగా ఉండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!