
.jpg&w=3840&q=75)
టాలీవుడ్లో ప్రస్తుతం అదృష్టం కలిసొస్తున్న నటిమణుల్లో భాగ్యశ్రీ బోర్సే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. తొలి రెండు సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా, ఆమెకు అవకాశాల పరంపర ఆగలేదు. అందం, తెరమీద కనిపించే ఆకర్షణ, నటన కలగలిసి ఆమెకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతున్నాయి. ఇప్పుడు భాగ్యశ్రీ నటించిన ‘కాంత’ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ పీరియాడిక్ డ్రామా 1950 కాలాన్ని నేపథ్యంగా తీసుకుని కోలీవుడ్ నేటివిటీతో సాగుతుంది. అన్ని భాషల ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ చాలా జాగ్రత్తగా చిత్రాన్ని రూపొందించినట్టు సమాచారం.
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూల్లో భాగ్యశ్రీ, ఈ సినిమా ద్వారా తనలోని నిజమైన నటిని ప్రేక్షకులు గమనిస్తారని ధైర్యంగా చెప్పింది. ఆ ధైర్యం వెనుక ఒక కారణం ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి. కథలో ప్రధానంగా దుల్కర్ సల్మాన్, సముతిరఖని మధ్య జరిగే అంతర్మథనం, సంఘర్షణలు కీలకం. ఈ ఇద్దరి మధ్య జరిగే ఉద్విగ్న పరిస్థితుల్లో కీలక మలుపులకు కారణమయ్యే పాత్ర భాగ్యశ్రీదని, ఆమెకు నటన చూపించుకునే అవకాశాలు విస్తారంగా ఉన్నాయని టాక్. ముఖ్యమైన ట్విస్ట్ విషయాన్ని బయటపెట్టలేకపోయినా, ఆమె పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అవకాశం ఉందని ఇండస్ట్రీలో ప్రచారం.
‘కాంత’ విజయం సాధిస్తే భాగ్యశ్రీ తమిళ పరిశ్రమలో కూడా సులభంగా అడుగు పెట్టగలదని భావిస్తున్నారు. అలాగే ఈ నెలాఖరున రాబోతున్న ‘ఆంధ్రకింగ్’ సినిమాపై కూడా మంచి సానుకూలత ఉండటంతో ఆమె కెరీర్లో మరింత మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి. రామ్ తో పాటు ఉపేంద్ర కూడా ఆ చిత్రంలో ఉండటం శాండల్వుడ్ అవకాశాలను కూడా తెరవొచ్చు. ఇంతలోనే నవంబర్ నెల భాగ్యశ్రీకి శుభకాలమయ్యే అవకాశం కనిపిస్తోంది.
హిందీలో గతంలో చేసిన చిన్న పాత్రలు పెద్దగా పేరు తీసుకురాకపోవడంతో, ఈసారి సౌత్ మార్కెట్పైనే ఆమె దృష్టిని కేంద్రీకరించింది. అంత నమ్మకంగా మాట్లాడుతున్న తీరు చూస్తే, ‘మహానటి’లో కీర్తి సురేష్ సాధించిన స్థాయి లాంటి గుర్తింపు కోసం ప్రయత్నిస్తుందేమో అనిపిస్తోంది.













.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!