

మెగా ఫ్యామిలీలో వరుసగా శుభకార్యాలు జరుగుతున్నాయి. అల్లు శిరీష్ ఇప్పటికే నిశ్చితార్థం అయ్యి, వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకోబోతున్నారు. వరుణ్ తేజ్ తాజాగా తండ్రిగా మారగా, రామ్ చరణ్ మరోసారి ఫాదర్ అవబోతున్నారు. ఇక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కూడా తన పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని, వచ్చే ఏడాది తన సినిమా రిలీజ్తో పాటు పెళ్లి కూడా జరుగుతుందని మీడియాకు చెప్పారు. అంటే పెళ్లి విషయం ఇప్పటికే ఖరారైందనే భావన కలుగుతోంది.
గతంలో సాయి తేజ్ తన ప్రేమ జీవితం, బ్రేక్-అప్ గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. హార్ట్బ్రేక్ నుంచి బయటపడడం చాలా కష్టమైందని కూడా చెప్పారు. ఆయన పెళ్లి విషయం ఎన్నాళ్లగానో వార్తలలో ఉంది. కొంతకాలం క్రితం ఆయనను కాలేజ్ ఫ్రెండ్తో లింక్ చేసిన రూమర్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఆయనే క్లారిటీ ఇచ్చి, వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అయితే పెళ్లికూతురు ఎవరో మాత్రం సస్పెన్స్గానే ఉంది.
సంబరాల యేటిగట్టు సినిమా విడుదల తర్వాత పెళ్లి జరుగనుందని సమాచారం. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో పెళ్లిళ్లు, శుభవార్తలు వరుసగా వస్తుండటంతో, 2025 సంవత్సరం మెగా అభిమానులకు వేడుకల సంవత్సరం కానుంది. ఇప్పుడు అందరి దృష్టి సాయి తేజ్ పెళ్లి కూతురు ఎవరు అన్నదానిపై ఉంది.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!