

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాలకు పైగా ప్రస్థానం చేసిన Akshaye Khanna, 2025లో తన కెరీర్లోనే అత్యంత ఘనమైన దశను నమోదు చేశారు. ఒకప్పుడు చాక్లెట్ బాయ్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, ఇప్పుడు విలన్ పాత్రలతో బాక్సాఫీస్ను షేక్ చేస్తూ కొత్త గుర్తింపును సంపాదించారు. ఒక్క ఏడాదిలోనే రూ. 2,000 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన రెండో భారతీయ నటుడిగా అక్షయ్ ఖన్నా చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు ఈ ఘనత కేవలం Shah Rukh Khan పేరుపైనే ఉంది.
2025 ఆరంభంలో విడుదలైన ఛావా చిత్రంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 809 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత డిసెంబర్లో వచ్చిన దురంధర్ చిత్రంలో రెహమాన్ డకైత్ పాత్రతో ఆయన మరోసారి సంచలనం సృష్టించారు. ఈ సినిమా రూ. 1,167 కోట్లు వసూలు చేయగా, ఈ రెండు చిత్రాల కలిపిన వసూళ్లు రూ. 2,001 కోట్లకు చేరాయి. ఖాన్ కుటుంబానికి చెందని నటుల్లో ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా అక్షయ్ ఖన్నా నిలిచారు.

















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!