

ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్ కుమార్ను జర్నలిస్టులు పలు ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా ఓ మహిళా జర్నలిస్ట్ షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గణ్, టైగర్ ష్రాఫ్ నటించిన పాన్ మసాలా ప్రకటనను ప్రస్తావిస్తూ.. అందరూ కుంకుమపువ్వు అమ్ముతున్నారని, మీరు ఏసర్ అమ్ముతున్నారా? అంటూ సరదాగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఈ ప్రశ్నకు అక్షయ్ కుమార్ ఎలాంటి వివరణ ఇవ్వకుండా నవ్వుతూ కనిపించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గతంలో అక్షయ్ కూడా పాన్ మసాలా ప్రకటనలో నటించడంపై విమర్శలు ఎదుర్కొని, అనంతరం ఆ ప్రకటనకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
మరోవైపు సెలబ్రిటీలు పాన్ మసాలా ప్రకటనల్లో నటించడంపై వివాదం కొనసాగుతోంది. షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గణ్, టైగర్ ష్రాఫ్ నటించిన ప్రకటనపై వచ్చిన విమర్శల నేపథ్యంలో మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!