

ఎప్పుడూ లేనంతగా ఈ వేసవిలో ఎండలు తీవ్రంగా మండుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలా మంది దాహాన్ని తీర్చుకోవడానికి వివిధ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. మండే ఎండల్లో అలసట తగ్గి శరీరానికి చల్లదనం అందించడానికి అమ్మమ్మల కాలం నాటి పల్లెటూరి సమ్మర్ ఎనర్జీ డ్రింక్ మళ్లీ ప్రాచుర్యం పొందుతోంది. ఈ సహజ పానీయం శరీరాన్ని చల్లబరచడంతో పాటు జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా, ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
ఈ డ్రింక్ తయారీకి ఒక కప్పు పుదీనా ఆకులు, రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం, మూడు టేబుల్ స్పూన్లు చక్కెర లేదా తేనె తీసుకోవాలి. అదనంగా అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, మూడు గ్లాసుల చల్లటి నీరు, ఒక కప్పు ఐస్ క్యూబ్స్ సిద్ధం చేసుకోవాలి. ముందుగా పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి, మిక్సీలో నిమ్మరసం మరియు చక్కెర లేదా తేనెతో కలిపి గ్రైండ్ చేయాలి. తరువాత చల్లటి నీరు వేసి మళ్లీ బ్లెండ్ చేసి, జీలకర్ర పొడి మరియు ఉప్పు కలపాలి. చివరగా జ్యూస్ను వడగట్టి గ్లాసుల్లో పోసి ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా సర్వ్ చేయాలి. పాత రోజుల్లో వేసవిలో ప్రతి ఇంటిలో తయారయ్యే ఈ పానీయం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.
గమనిక: రక్తహీనత తీవ్రంగా ఉన్నవారు స్వయంగా మందులు వాడకుండా ముందుగా రక్తపరీక్షలు చేయించుకుని వైద్యుల సలహా తీసుకోవాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!