
జనరల్

మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ చిత్రంపై ఆసక్తికర వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో అయ్యప్ప భక్తుడి పాత్రలో రవితేజ కనిపించనుండగా, ప్రియ భవాని శంకర్ కథానాయికగా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాలో కీలకమైన అతిథి పాత్ర కోసం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ను చిత్రబృందం సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిపాదనకు తారక్ కూడా సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ వార్త నిజమైతే ‘ఇరుముడి’ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!