

దక్షిణాది సినీ పరిశ్రమలో కమర్షియల్ దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన అట్లీ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే దర్శకత్వంతో పాటు నిర్మాతగా కూడా తన పరిధిని విస్తరించేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, అట్లీ నిర్మాణంలో ఓ కొత్త చిత్రం తెరకెక్కనుండగా, అందులో యువ నటుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
‘లవ్ టుడే’ విజయంతో యువతలో భారీ క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం పలు ఆసక్తికర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అట్లీ నిర్మించనున్న ఈ చిత్రానికి ఆయన శిష్యుల్లో ఒకరు దర్శకత్వం వహించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కథా చర్చలు పూర్తయ్యాయని, వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. అధికారిక ప్రకటన రాకపోయినా, అట్లీ-ప్రదీప్ కాంబినేషన్పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!