
.webp&w=3840&q=75)
టాలీవుడ్లో వరుస విజయాలను అందుకుంటూ భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడి’ సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ భారీ ప్రాజెక్ట్తో మరోసారి బాక్సాఫీస్పై కొత్త రికార్డులు సృష్టించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఇప్పుడు నాగ్ అశ్విన్ ఓ లెజెండరీ దర్శకుడితో చేతులు కలపబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రయోగాత్మక సినిమాలకు ప్రసిద్ధి చెందిన సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో ఒక కొత్త చిత్రాన్ని నాగ్ అశ్విన్ నిర్మించబోతున్నట్టుగా సమాచారం బయటకు వచ్చింది.
గతంలో అనుదీప్ కె.వి. దర్శకత్వంలో వచ్చిన ‘జాతిరత్నాలు’ చిత్రాన్ని ఆయన నిర్మించిన విషయం తెలిసిందే.
ఈసారి సింగీతం శ్రీనివాస రావు ఏ తరహా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారన్న దానిపై ఇప్పటికే ఆసక్తి పెరుగుతోంది. ఆయన గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు ఇప్పటికీ ప్రేక్షకుల గుర్తుల్లో నిలిచివున్నాయి. నాగ్ అశ్విన్ నిర్మించనున్న ఈ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.













.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!