

దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించబోయే ప్రతిష్టాత్మక చిత్రం ‘జై హనుమాన్’ ఈ నెల 22 న హంపిలో ఘనంగా ప్రారంభం కానుంది. ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ వచ్చే నెల లేదా ఏప్రిల్లో మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించేందుకు దర్శకుడు పెద్ద క్యాస్టింగ్ను తీసుకోవాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానా దగ్గుబాటి ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన విభిన్న గెటప్పుల్లో కనిపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మైత్రీ మూవీ మేకర్స్ మరియు టీ-సిరీస్ కలిసి ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇది ‘హనుమాన్’ సినిమాకు సీక్వెల్గా రూపొందుతోంది. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!