

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను పాకిస్థాన్ ఉగ్రవాదిగా ప్రకటించినట్లు కొన్ని వార్తాసంస్థలు నివేదించాయి. ఉగ్రవాది అని ప్రకటించడమే కాకుండా హీరో సల్మాన్ ఖాన్ను టెరరిస్ట్ వాచ్లిస్టు చేర్చినట్లు తెలుస్తోంది. బలూచిస్థాన్ దేశం ఏర్పాటుకు ఆయన మద్దతు ఇవ్వడమే అందుకు కారణంగా కనిపిస్తుంది.
ఏం జరిగిందంటే?
రియాద్లోని జాయ్ ఫోరం 2025లో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యల తర్వాత వివాదం ప్రారంభమైంది. అక్కడ భారతీయ సినిమా గురించి మాట్లాడుతూ.. బలూచిస్తాన్ విషయాన్ని కూడా విడిగా ప్రస్తావించారు. "ప్రస్తుతం, మీరు ఒక హిందీ సినిమా తీసి ఇక్కడ (సౌదీ అరేబియాలో) విడుదల చేస్తే, అది సూపర్ హిట్ అవుతుంది. మీరు ఒక తమిళ, తెలుగు లేదా మలయాళీ సినిమా తీస్తే, అది వందల కోట్ల వ్యాపారం చేస్తుంది ఎందుకంటే ఇతర దేశాల నుండి చాలా మంది ఇక్కడికి వచ్చారు.బలూచిస్తాన్ నుండి ప్రజలు ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి ప్రజలు ఉన్నారు. పాకిస్తాన్ నుండి ప్రజలు ఉన్నారు. అందరూ ఇక్కడ పనిచేస్తున్నారు" అని ఆయన వ్యాఖ్య చేశారు. అయితే ఈ వ్యాఖ్యలతో పాకిస్థాన్ను వ్యతిరేకించే వేర్పాటు వాదం "ఆజాద్ బలూచిస్థాన్" ఉద్యమాన్ని మద్దతు ఇస్తున్నట్లే అని పాకిస్థాన్ భావిస్తోంది.
బలూచిస్థాన్ ప్రస్తుతం పాకిస్థాన్లో భాగం అయినప్పటికీ.. హీరో సల్మాన్ఖాన్ ప్రత్యేకంగా ప్రస్తావించడం పట్ల ఆయన "ఆజాద్ బలూచిస్థాన్"కు మద్దుగా నిలిచినట్లు పాకిస్థాన్ భావిస్తోంది. ఈ క్రమంలో అతడ్ని తమ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించిన వారిని కూడా ఉగ్రవాదులుగా గుర్తించవచ్చని పాకిస్థాన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇదే విషయంపై పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!