

నందమూరి అభిమానులు చాలా కాలంగా నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు ప్రకటించిన ప్రాజెక్టులు ఒకటి తర్వాత ఒకటి ఆగిపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్లాన్ చేసినా, షూటింగ్ మొదలయ్యే దశలోనే కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ఈ సినిమాను బాలయ్య కూతురు తేజస్వీ నిర్మించాలనుకున్నారు.
ఈ సినిమా కోసం మోక్షజ్ఞ తన లుక్స్లో పెద్ద మార్పులు చేసుకున్నారు. గతంలో బరువుగా కనిపించిన మోక్షజ్ఞ, పూర్తిగా స్లిమ్ మేకోవర్తో హ్యాండ్సమ్గా మారారు. ఆయన లుక్ చూసి అభిమానులు ఎంతో ఆనందపడ్డారు. కానీ ఆ తర్వాత సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో మళ్లీ నిరాశ తప్పలేదు.
ఇప్పుడున్న తాజా సమాచారం ప్రకారం, మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆలస్యం చేయకుండా, సరైన కథతో సరైన సమయంలో లాంచ్ చేయాలని బాలయ్య భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ తొలి సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి చేతిలో పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. చారిత్రక నేపథ్యం, భావోద్వేగాలు, యాక్షన్ కలిపిన కథతో సినిమా రూపొందే అవకాశం ఉందని టాక్. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!