
సినిమాలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా హర్మూజ్ జలసంధిను మూసివేస్తామని ఇరాన్ ప్రకటించగా, ఈ మార్గం తమ నియంత్రణలోనే ఉందని అమెరికా చెబుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేస్తూ, హర్మూజ్ మార్గంలో చమురు రవాణా కోసం రహస్య ఆపరేషన్ నిర్వహించామని వెల్లడించారు.
వైట్ హౌస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్ లక్షల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ను 22 నౌకల ద్వారా రాత్రికి రాత్రే రహస్యంగా తరలించామని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలు గందరగోళానికి దారితీయడంతో, అమెరికా సైనికాధికారి ఒకరు ఇది వాణిజ్య నౌకలకు ఇచ్చిన ఎస్కార్ట్ ఆపరేషన్ గురించేనని స్పష్టం చేశారు. గత నెలలో సుమారు 70 నౌకలకు ఎస్కార్ట్ ఇవ్వగా, ఇటీవల దాదాపు 200 నౌకలు ఈ మార్గాన్ని దాటినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!