
జనరల్

ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి మెలోడీ టాఫీలు బహుమతిగా ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్టాక్ మార్కెట్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రభావంతో ‘పార్లే ఇండస్ట్రీస్’ షేర్లు ఒక్కసారిగా పెరగగా, చాలామంది రిటైల్ ఇన్వెస్టర్లు మెలోడీ టాఫీలకు ఈ కంపెనీకి సంబంధం ఉందని భావించి షేర్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
అయితే మెలోడీ టాఫీలను తయారు చేసేది ‘పార్లే ప్రొడక్ట్స్’ అనే FMCG సంస్థ కాగా, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ‘పార్లే ఇండస్ట్రీస్’ పూర్తిగా వేరే కంపెనీ. సోషల్ మీడియా ట్రెండ్స్ ఆధారంగా సరైన సమాచారం లేకుండా పెట్టుబడులు పెట్టడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!