
సినిమాలు

అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఎంసీఆర్హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ–దక్షిణాఫ్రికా మధ్య వాణిజ్య, పారిశ్రామిక సంబంధాలను మరింత విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరు పక్షాలు విస్తృతంగా చర్చించాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే దక్షిణాఫ్రికా పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని విధాల సహకారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!