
సినిమాలు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత సైన్యాధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ ధైర్యసాహసాలు, త్యాగాలకు గౌరవ సూచకంగా చెన్నైలోని వేలచ్చేరి–తాంబరం రోడ్డుకు ఆయన పేరును పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మేజర్ ముకుంద్ వరదరాజన్ దేశసేవలో చూపిన అంకితభావానికి నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ రహదారిని ఇకపై ‘మేజర్ ముకుంద్ వరదరాజన్ రహదారి’గా పిలవనున్నారు. ఈ నిర్ణయం ద్వారా వీర జవాన్ల త్యాగాలను గుర్తు చేస్తూ వారికి గౌరవం తెలిపినట్లు ప్రభుత్వం పేర్కొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!