

ఆన్లైన్ బెట్టింగ్ నైపుణ్యంతో కూడిన ఆట అయినప్పటికీ దానికి రాజ్యాంగ పరిరక్షణ ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివిధ క్రీడలపై ఆన్లైన్ బెట్టింగ్ను నిషేధిస్తూ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు తీసుకొచ్చిన చట్టాలను సమర్థిస్తూ, ఆన్లైన్ గేమింగ్ మరియు బెట్టింగ్ అంశాలపై చట్టాలు రూపొందించే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని ధర్మాసనం పేర్కొంది. సమాజ హితం, శాంతిభద్రతలు మరియు ప్రజల సంక్షేమం దృష్ట్యా ఇలాంటి నియంత్రణలు అవసరమని అభిప్రాయపడింది.
ఆన్లైన్ రమ్మీ, పోకర్ వంటి ఆటల్లో డబ్బులు పందెంగా పెట్టడం జూదం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ ఆటలకు నైపుణ్యం అవసరమైనప్పటికీ, డబ్బు పెట్టి ఆడితే అది బెట్టింగ్గా పరిగణించబడుతుందని తెలిపింది. యువతలో పెరుగుతున్న ఆన్లైన్ గేమింగ్ వ్యసనం, అప్పులు, ఆత్మహత్యల వంటి సామాజిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ తీర్పు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై కఠిన చర్యలకు మార్గం సుగమమయ్యే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!