

దివంగత నటి శ్రీదేవి కుటుంబానికి చెందిన చెన్నై ఆస్తి వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆస్తిపై తదుపరి విచారణ వరకు యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశిస్తూ, శ్రీదేవి భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లకు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ కె.వి. విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లీల ధర్మాసనం ఎం.సి. శివకామి, ఎం.సి. నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్పై ఈ ఆదేశాలు ఇచ్చింది.
ఈ ఆస్తిని శ్రీదేవి, ఆమె సోదరి శ్రీలత, తల్లి రాజేశ్వరి 1988లో కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఆ భూమిపై తమకు వారసత్వ హక్కు ఉందంటూ శివకామి, నటరాజన్, వారి తల్లి చంద్రభాను కోర్టును ఆశ్రయించారు. ఈ దావాను మద్రాస్ హైకోర్టు గతంలో కొట్టివేసింది. కేసు చాలా కాలం తర్వాత దాఖలైందని, పిటిషనర్లు తమ వాదనకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించలేదని హైకోర్టు పేర్కొంది. తాజాగా ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, అత్యున్నత న్యాయస్థానం స్టేటస్ కో విధించి కపూర్ కుటుంబానికి నోటీసులు జారీ చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!