

దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులను డిజిటలైజ్ చేసి జియోట్యాగింగ్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉమ్మీద్ పోర్టల్ పరిశీలనలో భారీ వ్యత్యాసాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో నమోదైన వక్ఫ్ ఆస్తుల వివరాలను పరిశీలించిన అధికారులు, భూమి రికార్డులు మరియు యాజమాన్య పత్రాల్లో సరిపోని వివరాలను గుర్తించారు. దీంతో వేల సంఖ్యలో నమోదైన వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్లో మొత్తం 1,18,302 వక్ఫ్ ఆస్తుల వివరాలు పోర్టల్లో నమోదు కాగా, వాటిలో ఇప్పటివరకు 31,328 ఆస్తుల రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా 31,192 క్లెయిమ్లను కూడా తిరస్కరించారు. భూమి పత్రాలు, రెవెన్యూ రికార్డులు, యాజమాన్యానికి సంబంధించిన డాక్యుమెంట్లలో భారీ వ్యత్యాసాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!