

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాల్లో పాల్గొనేందుకు న్యూయార్క్ వెళ్లనున్నారు. అమెరికా ప్రభుత్వం ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో పాటు కీలక ప్రతినిధులతో కూడిన బృందానికి వీసాలు మంజూరు చేసినట్లు తెలిపింది. సెప్టెంబర్ 22 నుంచి న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి ఉన్నతస్థాయి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయానికి ఆతిథ్య దేశంగా ఉన్న అమెరికా తన బాధ్యతలకు అనుగుణంగానే ఇరాన్ బృందానికి సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించినట్లు వెల్లడించింది.
అయితే ఇరాన్ ప్రతినిధి బృందంపై పలు పరిమితులు విధించినట్లు అమెరికా తెలిపింది. న్యూయార్క్లో వారి ప్రయాణం, కదలికలపై ఆంక్షలు ఉండటంతో పాటు విలాసవంతమైన వస్తువుల కొనుగోళ్లపైనా పరిమితులు ఉంటాయని పేర్కొంది. అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో ఇరాన్పై ఐక్యరాజ్య సమితి ఆంక్షల పర్యవేక్షణకు సంబంధించిన ప్రతిపాదనపై రష్యా, చైనాలు వీటో వేశాయి. అమెరికా ప్రతిపాదించిన ఆంక్షల పర్యవేక్షణ నిపుణుల బృందం గడువును పొడిగించే తీర్మానం 11-2 ఓట్లతో విఫలమైంది. అయితే ఈ వీటోతో ఇరాన్పై ఉన్న ఆంక్షలు రద్దు కాలేదని, పర్యవేక్షణ వ్యవస్థకు సంబంధించిన తీర్మానమే విఫలమైందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!