

మహారాష్ట్రలోని లోహగడ్ కోట వద్ద జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ డైరెక్టర్ కేతన్ అగర్వాల్ తన కాబోయే భార్య సియా గోయల్ మరియు ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కుట్రకు బలైనట్లు పోలీసులు గుర్తించారు. తొలుత జూన్ 18న కేతన్ ప్రమాదవశాత్తూ కోటపై నుంచి జారి పడిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం జరిగింది. అయితే కేతన్ మరణం తర్వాత సియా ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తం చేసిన కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.
పోలీసుల విచారణలో చేతన్ చౌదరి కీలక విషయాలను వెల్లడించాడు. నిశ్చితార్థాన్ని రద్దు చేసి పారిపోవడం కంటే కుటుంబ పరువు కాపాడుకోవడం కోసం కేతన్ను పూర్తిగా దారి నుంచి తొలగించాలని సియా భావించిందని అతడు అంగీకరించినట్లు సమాచారం. కోట టికెట్ కౌంటర్ వద్ద లభించిన సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలు ఈ హత్య ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు సూచించాయి. ఎండ తీవ్రత ఉన్నప్పటికీ హుడీ ధరించి సంచరించిన వ్యక్తి కదలికలు దర్యాప్తులో కీలకంగా మారాయి. ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరిలను జూన్ 29 వరకు పోలీస్ కస్టడీకి తరలించి మరింత విచారణ కొనసాగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!