

తెలంగాణలో రెండో దశ స్థానిక సంస్థల ఎన్నికలను డిసెంబర్లో నిర్వహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తైన తర్వాత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సైబరాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
వివిధ కారణాలతో ఎన్నికలు వాయిదా పడిన అచ్చంపేట, మందమర్రి, మణుగూరు, నకిరేకల్, కొత్తూరు, సిద్ధిపేట ప్రాంతాల్లోనూ అదే సమయంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల షెడ్యూల్, తేదీలపై ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తయ్యే సమయాన్ని బట్టి ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!