

మూడు రాజధానుల అంశాన్ని మళ్లీ ప్రస్తావిస్తే వచ్చే ఎన్నికల్లో మరింత నష్టం తప్పదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై జగన్తో పాటు వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఆయన ఘాటుగా స్పందించారు. వ్యక్తిగత ఆరోపణలు, కుట్ర కథనాలతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ఇప్పటికైనా ప్రజల తీర్పును జగన్ అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.
వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పులు, అయోమయం, అభివృద్ధి లేమితో ఇబ్బందులు ఎదుర్కొందని రామ్ తాళ్లూరి విమర్శించారు. అమరావతి రైతులను ఇబ్బందులకు గురిచేసి రాష్ట్ర భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టిందని ఆరోపించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో NDA ప్రభుత్వం అమరావతిని తిరిగి అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తోందని తెలిపారు. రామ్ తాళ్లూరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!