

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం కల్పించిన ఇసుక రవాణా సదుపాయం కొందరు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెలలో మరిపెడ, నెల్లికుదురు, నరసింహులపేట, చిన్నగూడూరు మండలాల్లో పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ, నిర్మాణాల డిమాండ్ పెరగడంతో మళ్లీ అక్రమ రవాణా పెరిగినట్లు తెలుస్తోంది.
ఇసుక రీచ్ల నుంచి వెళ్లే ప్రతి ట్రాక్టర్ అనుమతులను క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారుల ఇళ్లకే ఇసుక చేరుతోందో లేదో అధికారులు నిర్ధారించాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించిందని ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారులు ట్రిప్పుకు రూ.500 నుంచి రూ.1,000 వరకు వసూలు చేస్తున్నారని, అనుమతి లేని వాహనాలపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నరసింహులపేట, నెల్లికుదురు, మరిపెడ, చిన్నగూడూరు, కురవి, మహబూబాబాద్ ప్రాంతాల్లో భారీగా ఇసుక నిల్వలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఫిర్యాదులు వచ్చినా చర్యలు లేకపోవడంతో అక్రమ డంపులు పెరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. చెక్డ్యాముల నిర్లక్ష్యం, ఇసుక తవ్వకాలు సాగునీటి సమస్యలను పెంచుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!