
రాజకీయాలు

సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే నిరసనలపై సంచలన ఆరోపణలు చేశారు. కొందరు బయటి వ్యక్తులు నిరసనలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సీజేపీకి చెడ్డపేరు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీజేపీకి చెందిన వ్యక్తులు నిరసనల్లో పాల్గొని హింసాత్మక ఘటనలకు కారణమవుతున్నారని ఆయన అన్నారు.
అలాగే కొందరు సివిల్ డ్రెస్లో వచ్చి విద్యార్థులపై దాడులు చేస్తున్నారని అభిజిత్ దీప్కే తెలిపారు. జంతర్ మంతర్ ఎప్పుడూ నిరసనలకు అందుబాటులో ఉంటుందని, ప్రభుత్వం ఎప్పుడైనా తమతో చర్చలు జరపవచ్చని చెప్పారు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!