
జనరల్

ఈ సమయంలో చల్లటి జల్లులు కురవాల్సిన వేళ, మండే ఎండలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నా, అవి వర్షంగా మారడం లేదు. వేసవి తాపాన్ని తలపించే ఈ పరిస్థితుల్లో చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి. వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతుల మనసుల్లో ఆందోళన పెరుగుతోంది.
కరీంనగర్లో మబ్బుల మధ్య నుంచి కనిపించిన సాయంత్రపు సూర్యుడు ఆశతో పాటు ఆవేదనను కలిగిస్తున్నాడు. చల్లని చంద్రుడిలా దాగిపోకుండా, ఆవిరై పైకి చేరిన మేఘాలను కరిగించి వానగా కురిపించాలని రైతులు వేడుకుంటున్నారు. పంటల భవిష్యత్తు వానలపై ఆధారపడటంతో రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!