

పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ జలసంధిలో ఇరాన్పై నౌకాదళ దిగ్బంధం విధించనున్నట్లు ప్రకటించారు. ఆ జలసంధిలో ప్రయాణించే నౌకల నుంచి సరకు విలువలో 20 శాతం టోల్ వసూలు చేస్తామని తెలిపారు. ఇరాన్ నౌకల రాకపోకలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ ప్రకటనపై ఇరాన్ తీవ్రంగా స్పందిస్తూ, అమెరికా జోక్యాన్ని సహించబోమని, అవసరమైతే బలప్రయోగానికి దిగుతామని హెచ్చరించింది. హర్మూజ్ తమ నియంత్రణలోనే ఉందని స్పష్టం చేసింది.
ఇదే సమయంలో ప్రాంతంలో దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. అమెరికా ఇరాన్లో పలు ప్రాంతాలపై దాడులు చేసినట్లు తెలిపింది. దీనికి ప్రతిగా ఇరాన్ కువైట్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలపై దాడులు జరిపింది. అణు కేంద్రాల తనిఖీలకు ఐఏఈఏకు అనుమతి నిరాకరించింది. అంతేకాకుండా కొన్ని విదేశీ నేతలపై హిట్ లిస్టు ప్రచురించబడినట్లు సమాచారం. ట్రంప్ టోల్ ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందిస్తూ, తామే హర్మూజ్ రక్షకులమని, తక్కువ టోల్ వసూలు చేస్తామని తెలిపారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!