
క్రీడలు

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలోని కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన కార్మికులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రిలో జరుగుతున్న చికిత్స వివరాలను కూడా ఆయన పరిశీలించారు. వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తుందని, బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!