

సాయికృష్ణ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును విజయవాడ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్కు పంపించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. మే 6న మార్కాపురంలో సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న కృష్ణలంక పోలీసులు, అనంతరం అతడిని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చినట్లు సిట్ పేర్కొంది.
పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో తీవ్ర గాయాల కారణంగా సాయికృష్ణ మరణించి ఉండొచ్చని సిట్ అభిప్రాయపడింది. అతడు కస్టడీలో ఉన్న విషయాన్ని కావాలనే దాచిపెట్టి, హైకోర్టుకు తప్పుడు సమాచారం అందించినట్లు ఆరోపించింది. కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను ధ్వంసం చేశారని, 2026 మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజీని తొలగించినట్లు నివేదికలో పేర్కొంది. సీఐ నాగరాజు విడుదలైతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిట్ కోర్టుకు తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!