

ఒడిశాలోని పారాదీప్ తీరానికి ఏపీకి చెందిన మత్స్యకారుల బోటు చేరుకుంది. ఇంజిన్లో సాంకేతిక లోపం కారణంగా సముద్రంలో నిలిచిపోయిన బోటులోని 10 మంది మత్స్యకారులను ఒడిశా ప్రభుత్వం, కోస్ట్గార్డ్, మెరైన్ పోలీసులు, ఫిషరీస్ అధికారులు సురక్షితంగా రక్షించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టి, వారిని పారాదీప్ నుంచి విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
బోటు డ్రైవర్ కారె చిన్నాకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ చిన్నాను పరామర్శించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. తన కళ్లముందే ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో మునిగిపోయారని చిన్నా తెలిపినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. తీవ్ర షాక్లో ఉన్న చిన్నా ఇంకా ఘటన నుంచి కోలుకోలేదని తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!