
బిజినెస్

అమరావతిలో జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యా విభాగాల పురోగతిని సమీక్షించారు. ఈ సమావేశానికి ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కోర్సుల ఫోర్కాస్టింగ్ చేయాలని సీఎం సూచించారు.
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో కోర్సుల రీస్ట్రక్చరింగ్ చేపట్టాలని, రీసెర్చ్, ఇన్నోవేషన్, స్టార్టప్లను ప్రోత్సహించేలా విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. క్వాంటం టెక్నాలజీపై కోర్సును ప్రారంభించిన ఆంధ్రా యూనివర్సిటీ ను అభినందించిన సీఎం, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ప్రపంచ స్థాయి సంస్థలతో పోటీ పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!