
క్రీడలు

తిరుపతి వేదికగా ‘అమరావతి ఛాంపియన్షిప్ 2.0’ క్రీడా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 నుంచి 27 వరకు నిర్వహించనున్న ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్లోని 12 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. రాష్ట్ర మంత్రుల ఆధ్వర్యంలో ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు.
తిరుపతిలోని తారక రామ స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ క్రీడా సంబరాలు రాష్ట్రంలోని ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు మంచి వేదికగా నిలవనున్నాయి. మట్టిలో దాగి ఉన్న మాణిక్యాల్లాంటి క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి మరిన్ని అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ఛాంపియన్షిప్ను నిర్వహిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!