

ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్స్టార్ వినియోగదారుల కోసం కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. క్రికెట్ లేదా ఇతర ప్రత్యక్ష ప్రసారాలను వీక్షిస్తున్న సమయంలో యాప్ను విడిచిపెట్టకుండా భోజనం ఆర్డర్ చేసుకునే విధంగా ‘అంతర్గత భోజన ఆర్డర్ సేవ’ను ప్రారంభించింది. ఇందుకోసం ప్రముఖ ఆహార సరఫరా సంస్థ స్విగ్గీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సదుపాయం ప్రస్తుతం దేశంలోని 690కు పైగా నగరాల్లో అందుబాటులో ఉంది.
మొబైల్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ సేవ ద్వారా, మ్యాచ్ చూస్తూనే హోటళ్ల ఎంపిక, ప్రత్యేక రాయితీలు పొందడం, ఆర్డర్ ఇవ్వడం, సరఫరా స్థితిని గమనించడం వంటి సౌకర్యాలు లభిస్తున్నాయి. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటికే 3.7 కోట్ల మందికి పైగా ఈ సేవను ఉపయోగించినట్లు సంస్థలు వెల్లడించాయి. అత్యధికంగా బర్గర్లకు డిమాండ్ నమోదైంది. ఒక వినియోగదారు ఈ సీజన్లో 34 సార్లు ఆర్డర్ చేయగా, మరొకరు ఒకేసారి 100కు పైగా బర్గర్లు ఆర్డర్ చేసినట్లు తెలిపారు. ముంబై జట్టు మ్యాచ్ల సమయంలో అత్యధిక ఆర్డర్లు నమోదయ్యాయని కంపెనీలు పేర్కొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!