

ఇంటర్నెట్ చరిత్రలో తొలిసారిగా మానవుల కంటే బాట్ల ద్వారా వచ్చే ట్రాఫిక్ అధికమైందని క్లౌడ్ఫ్లేర్ సీఈఓ మాథ్యూ ప్రిన్స్ వెల్లడించారు. ఏఐ ఆధారిత ఏజెంట్ల వినియోగం వేగంగా పెరగడంతో ఈ మార్పు ఊహించిన దానికంటే ముందుగానే చోటుచేసుకుందని ఆయన పేర్కొన్నారు. క్లౌడ్ఫ్లేర్ తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుతం మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్లో 57.5 శాతం బాట్లదే కాగా, మానవుల ట్రాఫిక్ వాటా 42.5 శాతానికి పరిమితమైంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం కొత్త తరం ఏఐ ఏజెంట్లేనని సంస్థ స్పష్టం చేసింది.
హోటల్ ధరలను పోల్చడం, విమాన టికెట్ రేట్లను పరిశీలించడం, ఉత్పత్తుల వివరాలను సేకరించడం, ఏఐ చాట్బాట్ల కోసం వెబ్ కంటెంట్ను విశ్లేషించడం, కస్టమర్ సర్వీస్ సేవలు అందించడం వంటి అనేక పనులను ఈ ఏఐ ఏజెంట్లు స్వయంగా నిర్వహిస్తున్నాయి. అయితే యాప్ వినియోగం, వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా వంటి విభాగాల్లో మాత్రం ఇప్పటికీ మానవులే ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో ఇంటర్నెట్ వినియోగ విధానాన్ని ఏఐ ఏజెంట్లు గణనీయంగా మార్చే అవకాశముందని క్లౌడ్ఫ్లేర్ విశ్లేషించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!