

రాబోయే ఏడాది జరిగే పురుషుల టీ20 వరల్డ్కప్ కు సంబంధించిన టికెట్లు నేడు సాయంత్రం 6:45 IST (13:15 GMT) నుంచి కొనుగోలుకు అందుబాటులోకి రానున్నాయని ఐసీసీ ప్రకటించింది. భారతదేశంలో మ్యాచ్ టికెట్ ధరలు కేవలం ₹100 నుంచి ప్రారంభం కావడం విశేషం. శ్రీలంకలో జరిగే మ్యాచ్ల కోసం టికెట్లు LKR 1000 ($3.26) నుంచి లభించనున్నాయి.
ఈసారి టికెట్ ధరలను చాలా తక్కువగా ఉంచడం వల్ల ఎక్కువ మంది అభిమానులు మ్యాచ్లు ప్రత్యక్షంగా చూడగలరని ఐసీసీ భావిస్తోంది. ముఖ్యంగా భారత్ ఆతిథ్య దేశాల్లో ఒకటిగా ఉండడంతో టికెట్ల కోసం భారీ డిమాండ్ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా భారత జట్టు మ్యాచ్లు కొన్ని నిమిషాల్లోనే సేల్ అవుతాయని భావిస్తున్నారు.
టీ20 వరల్డ్కప్ 2026 భారత్, శ్రీలంకలోని పలు వేదికల్లో జరగనుండగా, అభిమానులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని ఐసీసీ సూచిస్తోంది. తక్కువ ధరలు, పెరిగిన క్రికెట్ క్రేజ్ నేపథ్యంలో ఈ టోర్నమెంట్కు రికార్డు స్థాయి స్టేడియం హాజరు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!