

పంతొమ్మిదో సీజన్లో వరుణుడు వరుసగా ఆటను ప్రభావితం చేస్తున్నాడు. ఈడెన్ గార్డెన్స్లో పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా పూర్తిగా కొనసాగలేకపోయింది. అదే పరిస్థితి ఈసారి గువాహటిలోనూ కనిపించింది. టాస్కు ముందే చినుకులు పడటంతో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్లో టాస్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7:00 గంటలకు జరగాల్సిన టాస్ వర్షం కారణంగా మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ మ్యాచ్లో విజయం సాధించి ముందంజ వేయాలని భావించిన ముంబై శిబిరంలో ఆందోళన నెలకొంది.
ఐపీఎల్లో వరుసగా రెండు విజయాలతో మంచి ఫామ్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ తమ హోం గ్రౌండ్లో ముంబై ఇండియన్స్తో తలపడుతోంది. ఈ మ్యాచ్లో గెలిచి టేబుల్ టాపర్గా కొనసాగాలని భావించిన ఆ జట్టు ఆశలపై వర్షం ప్రభావం చూపుతోంది. ఈ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్కు కూడా వర్షం ముప్పు తప్పేలా కనిపించడం లేదు. గత నిన్న ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా ఇన్నింగ్స్ 3.4 ఓవర్లకే వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే.
.webp&w=3840&q=75)





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!