
క్రీడలు

ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగిస్తూ లక్నో సూపర్ జెయింట్స్పై భారీ విజయం సాధించింది. ప్రియాన్ష్ ఆర్య (93), కూపర్ కొన్నొల్లీ (87)ల విధ్వంసక ఇన్నింగ్స్లతో పంజాబ్ 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్లు ప్రారంభం నుంచి దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేశారు.

255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు 20 ఓవర్లలో 200/5 స్కోర్ చేసింది. ఎడెన్ మార్క్రమ్ (42), రిషభ్ పంత్ (43), మిచెల్ మార్ష్ (40) పోరాడినా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. అవసరమైన రన్రేట్ పెరుగుతుండడంతో లక్నో లక్ష్యానికి చేరుకోలేకపోయి రెండొందల లోపే పరిమితమైంది. దీంతో పంజాబ్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సీజన్లో ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది.










.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!