

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్లో నాలుగో బెర్తు కోసం పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ నాకౌట్ దశకు చేరుకోగా, మిగిలిన ఒకే ఒక్క స్థానానికి రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు కొనసాగుతోంది. ప్రస్తుతం రాజస్థాన్ 14 పాయింట్లతో ముందంజలో ఉండగా, పంజాబ్, కేకేఆర్ చెరో 13 పాయింట్లు, ఢిల్లీ 12 పాయింట్లతో ఆశలు సజీవంగా ఉంచుకున్నాయి.
మే 23న లఖ్నవూ సూపర్ జెయింట్స్తో పంజాబ్ కింగ్స్ కీలక మ్యాచ్ ఆడనుంది. ఇందులో గెలిస్తే పంజాబ్ 15 పాయింట్లతో బలమైన స్థితిలోకి వెళ్తుంది. మే 24న మధ్యాహ్నం రాజస్థాన్ రాయల్స్-ముంబయి ఇండియన్స్ మ్యాచ్ ప్లేఆఫ్స్ రేసులో కీలకంగా మారనుంది. రాజస్థాన్ గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది. అయితే ఓడితే సాయంత్రం ఈడెన్ గార్డెన్స్లో జరిగే కేకేఆర్-ఢిల్లీ మ్యాచ్కు ప్రాధాన్యం పెరుగుతుంది. పంజాబ్, రాజస్థాన్ ఓడిపోయి కేకేఆర్ గెలిస్తే కోల్కతా నాకౌట్కు చేరే అవకాశం ఉంది. ఢిల్లీ అవకాశాలు మాత్రం నెట్ రన్రేట్, వర్షం ప్రభావంపై ఆధారపడే పరిస్థితి కనిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!