

ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని సాధించింది. ముంబై ఇండియన్స్పై 6 వికెట్ల తేడాతో గెలిచిన ఢిల్లీ, సొంత మైదానంలో తమ శక్తిని మరోసారి చాటింది. 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి విజేతగా నిలిచింది.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 51 పరుగులతో అర్ధశతకం నమోదు చేయగా, రోహిత్ శర్మ 35 పరుగులతో తోడ్పడ్డాడు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు తీసి మెప్పించగా, అక్షర్ పటేల్ పొదుపుగా బౌలింగ్ చేసి ఒక వికెట్ సాధించాడు. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గైర్హాజరుతో ఈ మ్యాచ్లో ముంబై జట్టును సూర్యకుమార్ యాదవ్ నడిపించాడు.
163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే వికెట్ కోల్పోయినప్పటికీ, యువ ఆటగాడు సమీర్ రిజ్వీ అద్భుత ప్రదర్శనతో జట్టును విజయానికి నడిపించాడు. కేవలం 51 బంతుల్లో 90 పరుగులు చేసి మ్యాచ్ను మలుపుతిప్పాడు. పతుమ్ నిస్సాంక 44 పరుగులతో కీలక సహకారం అందించగా, చివర్లో డేవిడ్ మిల్లర్ బౌండరీతో మ్యాచ్ను ముగించాడు. ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడిన సమీర్ రిజ్వీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!