

నితీష్ కుమార్ రెడ్డి నేడు (మే 26) తన 22వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కూల్గా బ్యాటింగ్ చేస్తూనే అవసరమైనప్పుడు భారీ షాట్లు ఆడగల సామర్థ్యం, బౌలింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పగల టాలెంట్, క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని అధిగమించే టెంపరమెంట్ నితీష్ను ప్రత్యేక ఆటగాడిగా నిలబెట్టాయి. విశాఖపట్నంలో జన్మించిన నితీష్.. 2017-18 అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో 1,237 పరుగులు చేసి బీసీసీఐ బెస్ట్ క్రికెటర్ అవార్డు అందుకొని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ 2024లో అద్భుత ప్రదర్శనతో నితీష్ కెరీర్ మలుపుతిరిగింది. లోయర్ మిడిల్ ఆర్డర్లో వేగంగా పరుగులు సాధిస్తూ, కీలక వికెట్లు పడగొట్టి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును గెలుచుకున్నాడు. అతని ప్రతిభను గుర్తించిన ఎస్ఆర్హెచ్ యాజమాన్యం రూ.6 కోట్లకు రిటైన్ చేసుకుంది. అనంతరం మెల్బోర్న్లో ఆస్ట్రేలియాపై టెస్ట్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించిన నితీష్.. హార్దిక్ పాండ్యా తర్వాత భారత్కు దొరికిన అసలైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా ప్రశంసలు అందుకుంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!