

మహిళల ఆసియా కప్ 2026లో థాయ్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ అరుదైన మైలురాయిని అందుకున్నారు. ఈ మ్యాచ్ ఆమె కెరీర్లో 150వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్గా నిలిచింది. దీంతో భారత మహిళల క్రికెట్లో 150 టీ20లు ఆడిన మూడో క్రీడాకారిణిగా దీప్తి శర్మ రికార్డు సృష్టించారు. ఆమెకు ముందు హర్మన్ప్రీత్ కౌర్ 202 మ్యాచ్లతో, స్మృతి మంధాన 171 మ్యాచ్లతో ఈ ఘనత సాధించారు. ప్రపంచ మహిళల క్రికెట్లో 150 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన 12వ క్రీడాకారిణిగా కూడా దీప్తి నిలిచారు.
మరోవైపు, థాయ్లాండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. గాయంతో జెమీమా రోడ్రిగ్స్ జట్టుకు దూరం కావడంతో ఆమె స్థానంలో ప్రతికా రావల్కు అవకాశం లభించింది. దీంతో ప్రతికా రావల్ భారత్ తరఫున టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఆమెకు టీ20 క్యాప్ అందించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!