

హైదరాబాద్లోని రవీంద్రభారతిలో శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించబడ్డాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ వేమ్ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు అధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ పరాభవ నామ ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, ఈ కొత్త సంవత్సరం రైతులకు అంకితం అయిన సంవత్సరం అని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చి, రైతును ఆర్థికంగా బలపర్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ అందిస్తున్నామని, తెలంగాణలో రైతులపై రుణభారం దేశంలోనే తక్కువగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 70 శాతం కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయని వివరించారు.
రైతుల సంక్షేమం కోసం రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి వారిని రుణభారం నుండి విముక్తులుగా చేశామని తెలిపారు. రైతు భరోసా పథకానికి రూ.18 వేల కోట్లు ఖర్చు చేశామని, ఈ నెల 22న మరో విడత నిధులు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. భూసమస్యలను పరిష్కరించేందుకు కొత్త విధానాలతో ముందుకు సాగుతున్నామని, రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.
ప్రకృతి వైపరీత్యాల విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.
















.jpg&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!