
క్రీడలు

తెలంగాణ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ నేత కే.టీ.రామారావు చేసిన ధాన్యం కొనుగోళ్ల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో రైతుల్లో గందరగోళం సృష్టించేందుకు కేటీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసం వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు.
ప్రజా పాలనలో ధాన్యం కొనుగోళ్లు పూర్తిగా పారదర్శకంగా జరుగుతున్నాయని, కొనుగోళ్లు మరియు చెల్లింపుల వివరాలను నిరంతరం బహిర్గతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 20 కోట్ల 86 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ పాలనలోనే కొనుగోలు కేంద్రాల్లో అవినీతి జరిగిందని, ఇప్పుడు రైతుల పేరుతో రాజకీయ డ్రామాలు చేయవద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!