

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే బలమైన పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాల మెజారిటీకి కాస్త దూరంలో నిలిచింది. దీంతో ఫలితాల అనంతర పొత్తులపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎ. చంద్రశేఖర్ మీడియాతో స్పందిస్తూ, తన పాత్ర తండ్రిగానే పరిమితమని, పార్టీ వ్యూహాత్మక నిర్ణయాల్లో తాను పాల్గొననని స్పష్టం చేశారు.
పొత్తులపై నిర్ణయం పూర్తిగా విజయ్దేనని ఆయన తెలిపారు. తన కుమారుడి ఎన్నికల ప్రదర్శనపై గర్వంగా ఉందని పేర్కొన్న ఆయన, విజయ్కి సమాజ సేవ చేయాలనే ఆలోచన చాలా కాలంగా ఉందన్నారు. టీవీకే, డీఎంకే మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని విజయ్ ముందే చెప్పారని, అది ఇప్పుడు నిజమైందని చెప్పారు. రాజకీయాల్లోకి రావడం ఆకస్మిక నిర్ణయం కాదని, ఇది 20 ఏళ్ల ప్రణాళికలో భాగమని చంద్రశేఖర్ వివరించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!