

సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు, తప్పుడు సమాచారం వ్యాప్తి, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారిపై దుష్ప్రచారం వంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై నెట్వర్క్ ఆధారిత దర్యాప్తు వేగవంతం చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసు అధికారులను ఆదేశించారు. అయితే భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, ప్రజాస్వామ్య చర్చలు, చట్టబద్ధ విమర్శలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. గత రెండేళ్లలో ఇలాంటి నేరాలపై 1,665 కేసులు నమోదు కాగా, సహయోగ్ పోర్టల్ ద్వారా 12,653 వెబ్లింక్లను తొలగించినట్లు వెల్లడించారు.
మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీష్కుమార్ గుప్తాతో కలిసి నిర్వహించిన సమీక్షలో హోంమంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లో సైబర్ గార్డ్ యూనిట్లు, జిల్లా సోషల్ మీడియా యూనిట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. సున్నిత ప్రాంతాల్లో రాజకీయ పర్యటనలకు ప్రత్యేక నిర్వహణ విధానాలు రూపొందించాలని, భూ వివాదాల ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!