
సినిమాలు

తెలంగాణ వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ విజయవంతంగా పనిచేస్తోందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డా. బి. గోపి తెలిపారు. ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునే సౌకర్యాన్ని రైతులకు అందిస్తూ, ఈ పైలట్ ప్రాజెక్టును ఆదిలాబాద్, మహబూబ్నగర్, నల్గొండ, జనగాం, పెద్దపల్లి జిల్లాల్లో ఈ నెల 22 నుంచి అమలు చేస్తున్నారు.
మూడు రోజుల్లోనే ఈ ఐదు జిల్లాల్లో 37,264 మంది రైతులు యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకుని, మొత్తం 1,15,534 బస్తాలను కొనుగోలు చేశారు. పైలట్ జిల్లాలు కాకుండా మిగతా జిల్లాల రైతులు యథావిధిగా యూరియా విక్రయ కేంద్రాల వద్ద నేరుగా కొనుగోలు చేయవచ్చని డా. గోపి స్పష్టం చేశారు. దశలవారీగా మిగతా జిల్లాల్లోనూ యూరియా బుకింగ్ యాప్ను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!