

శర్వానంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోగి చిత్ర షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పూర్తయ్యాక, శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందనున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్లో శర్వానంద్ నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్కు జార్జ్ క్రిష్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి.
ఈ సినిమాలో శర్వానంద్ సరసన యువ నటి ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కన్నప్ప చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రీతి, ఇటీవల బ్లాస్ట్ చిత్రంతో గుర్తింపు పొందింది. అనిల్ సుంకర నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుండగా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!